AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 26/ అక్షరం న్యూస్/-----ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ చైతన్య ఆదేశాలతో చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ప్రిన్సిపాల్ నరేంద్ర అధ్యక్షతన పేరెంట్స్ కమిటీ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు లెక్చరర్స్ కు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చాలా ఘన చరిత్ర ఉంది. ఇటువంటి కళాశాల యందు పనిచేయడం చాలా గర్వకారణమని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్ ఇరవై మూపై సంవత్సరముల అనుభవం గలవారు. వారందరూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ కళాశాలలోనే చదువుకొని ఇక్కడే అధ్యాపకులుగా పనిచేస్తూ కార్పొరేట్ కాలేజీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సుమారు 50 సంవత్సరముల చరిత్ర కలిగి ఎందరో విద్యార్థినీ విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో ఉంచినటువంటి మారుమూల జూనియర్ కళాశాల యందు పనిచేయడం గర్వంగా ఉందన్నారు. అంతటి చరిత్ర కలిగిన కాలేజీ యందు మీ పిల్లలను చేర్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. కమిషనర్ ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లేనటువంటి సౌకర్యాలు మన కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధునాతన సౌకర్యాలతో కంప్యూటర్స్ ల్యాబ్ లైబ్రేరియన్ వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ కాలేజీలకు భిన్నంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు గత సంవత్సరం అత్యధిక రిజల్ట్ ను సాధించడం జరిగిందన్నారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎందరో ఉన్నారు. అటువంటి ఘనకీర్తి కలిగిన చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు తమ పిల్లలను చేర్పించాలని ఆయన అన్నారు. ఇకనుంచి ప్రతి నెల పేరెంట్స్ కమిటీ మీటింగ్ ను నిర్వహించి కళాశాల పురోగతికి తమ వంతు తోడ్పాటు మరియు సూచనలు సలహాలతో కళాశాల పురోభివృద్ధికి తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తామని ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో కారం కృష్ణమోహన్ అమృత రావు శేట్టి ప్రసాదు కృష్ణ సమ్మయ్య వెంకన్న భద్రం కొండలరావు గంగరాజు మరియు కార్యనిర్వహణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily