Saturday, 18 April 2026 04:25:47 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఉపాధి వేటలో.. చితికిన బతుకు. బహ్రెయిన్ లో పోతుగల్ వాసి మృతి


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 08 January 2026 07:49 PM Views : 1889

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జనవరి-08(అక్షరం న్యూస్) ఉన్న ఊరిలో బతకలేక.. సరైన కూలి, ఉపాధి లేక ఆర్జన కోసం విదేశాలకు వలస వెళ్లిన వారు అక్కడ మరణిస్తే ఇక్కడ వారి కుటుంబం బాధ వర్ణనాతీతమే.. తండ్రి వస్తాడని పిల్లలు, భర్త వస్తాడని భార్య, కొడుకు వస్తాడని తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఉన్న ఊరిలో ఉపాధి దొరకక, బతకడం భారమై విదేశాలకు వెళ్లి కూలీ, నాలీ చేస్తూ జీవించేందుకు ఎంతో మంది విదేశీ బాట పడుతున్నారు.అక్కడ సరైన పని దొరకక, ఇబ్బందులు పడుతూ ఇక్కడి వారికి కష్టం చెప్పుకోలేక బాధపడుతున్నారు. అక్కడ సరైన పని లేక వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో మరింత ఆర్థిక సమస్యల్లో కుంగిపోతున్న మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మానసిక సమస్యలు శారీరక రుగ్మతలకు కూడా దారి తీస్తున్నాయి. దీంతో అక్కడే కన్ను మూస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన పిట్ల దేవరాజు (52)గత ఐదు సంవత్సరాల క్రితం బహ్రెయిన్ దేశం బ్రతుకు దెరువు కోసం వలస వెళ్ళాడు పనిచేసుకుంటు బ్రతుకు వెళ్ళదిస్తున్న క్రమంలో దేవరాజు పని చేసే కంపెనీ నుండి దేవరాజు గురు వారం ఉదయం బాత్రూం లో చనిపోయినట్లు తెలియచేయడం తో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు.  బాధిత కుటుంబ పరిస్థితిని గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల ఎన్ ఆర్ ఐ జిల్లా అధ్యక్షులు తోట దర్మేందర్ లు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం అతనికి భార్య స్వప్న, ఇద్దరు కొడుకులు ఉన్నారు మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :