D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నారాయణపురం గ్రామానికి చెందిన చిర్ర లింగయ్య మాతృమూర్తి భూలక్ష్మి ఇటీవల మృతి చెందారు. సోమవారం ఆమె దశదినకర్మ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్కూ రాకుల నాగభూషణం, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, ఖమ్మం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు, చిలకల వెంకట నరసయ్య, రాచబంటి వంశీ, రామకృష్ణ, చందర్రావు, హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా:- ఆ గ్రామాన్ని చెందిన రాసమల్ల వెంకటేశ్వర్లు నాయనమ్మ రాసమల్ల నాగలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఆమె దశదినకర్మకు హాజరై ఆమె చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాసమల్ల సురేష్, కొలిపాక బాలకృష్ణ, కన్య దేవర రామకృష్ణ, రాసమల్ల పెద్దబ్బాయి, శివ , వంశీ, అప్పారావు, శీను, రామకృష్ణ, రాములు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily