AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 13/ అక్షరం న్యూస్/-----ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా అంటూ పలక రమేష్ ఎవరి కోసమో ఎదురు చూడకుండా తన వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా గత కొద్ది రోజులుగా నిత్యం రద్దీగా ఉండే పాత చర్ల గాంధీ బొమ్మ సెంటర్ నందు ప్రతినిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్లన్నీ ధ్వంసమై ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా కానీ అటు అధికారులు గానీ రాజకీయ నాయకులు గానీ పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన పలక రమేష్ తన సొంత ఖర్చులతో గుంతలను పూడ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పలక రమేష్ చేసిన మంచి పనికి పలువురు ఈ అభినందనలు తెలియజేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పాత చర్ల నుంచి గుంపెనగుడెం వరకు ఏర్పడిన గుంతలను పూర్చి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని పలక రమేష్ అధికారులను కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily