AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 13/ అక్షరం న్యూస్/----స్థానిక సిపిఐ కార్యాలయం నందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఈ నెల 11 నుంచి 17 వరకు వాడవాడలా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు తొత్తులుగా ఉన్న పటేల్ పట్వారి జమీందారులను తరిమికొట్టిన కమ్యూనిస్టు గెరిల్లాలకు జోహార్లు మీ స్ఫూర్తిని నేటి యువతరానికి అందిస్తాం అన్నారు. 1948 సెప్టెంబర్ 17 న కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిందన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణలుగా చూపే మతోన్మాద కుట్రలను తిప్పి కోడదంమన్నారు. పటేల్ చీకటి ఒప్పందం ఫలితమే నిజాం రాజుకు గవర్నర్ పదవి తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నే నిజాం నిరంకుశ పాలన రద్దయింది తప్ప పటేల్ సైనిక చర్యల వల్ల కాదు అన్నారు. సాయుధ పోరాటంలో 4,000 మంది యువకిశోరాలు చనిపోయినారని 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సిపిఐ పార్టీ దన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని అప్పుడే వారికి ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ సిపిఐ మండల కార్యదర్శి నూప పోతయ్య సీనియర్ నాయకులు నూక తిరుపతిరావు పాల్వంచ రామారావు సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు చల్లా లక్ష్మీనారాయణ పాలెం సత్యనారాయణ కోడి రెక్కల రాజారావు కొవ్వాసి దేవయ్య భీమయ్య మడకం నందయ్య మురళి గుండె సమ్మయ్య నూప రాము డబ్బా శంకర్ గుండి శ్రీను మడకం కమలేష్ మడకం సోమయ్య చుక్కయ్య పోశయ్య దేవి మంగమ్మ నరసమ్మ అనసూర్య జోడి రామయ్య దీపక్ మహేష్ ముత్తయ్య తోట శ్రీను. తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily