Friday, 31 July 2026 08:25:18 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బిజెపిలో చేరిన 20 కుటుంబాలు... పార్టీ కండవా కప్పిన జిల్లా అధ్యక్షులు నెల్లూరి...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 17 November 2025 08:40 PM Views : 450

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ నవంబర్/ 17 (అక్షరంన్యూస్) వైరా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నుంచి 20 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు నూతనంగా పార్టీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు అశోక్, చెన్న ఎల్లారావు, వేముల రామ్ చరణ్, బత్తుల నాగరాజు, పెద్ది గోపి, వడ్లమూడి సుజేష్ లక్ష్మణ్, తమ్మిశెట్టి దుర్గారావు తదితరులు పార్టీలో సభ్యత్వం పొందారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ... బిజెపి చేపడుతున్న ప్రజా పాలన, అభివృద్ధి విధానాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. వైరా నియోజకవర్గం అభివృద్ధికి బిజెపి మాత్రమే కట్టుబడి పనిచేస్తుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు బండారు నరేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :