Saturday, 18 April 2026 04:20:04 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 20 April 2025 05:44 PM Views : 1230

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఏప్రిల్ 20 (అక్షరం న్యూస్) ఓదెల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థులు నాగపురి రాజు పరకాల తిరుపతి మిట్టపల్లి శంకర్ పి బిక్షపతి నూతి శంకర్ ఆధ్వర్యంలో ఓదెల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 1999 2000 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి విద్య గురువులైన రంగారావు గిరిధర్. మల్లారెడ్డి విజయ్ కుమార్ వెంకటేశ్వర్లు నతానియాల్ సమ్మయ్య రాజేష్ కుమార్ తీర్థాల సదానందం లను ఘనంగా శాలువులతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ గురువులు మాట్లాడుతూ, అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 25 ఏళ్ళ తరువాత కూడా తమను గుర్తుంచుకుని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా ఉపయోగం ఉందని మన తోటి చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు వారు ఎలా బతుకుతున్నారు వాళ్ళ జీవన విధానం ఏమిటి వారి పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది క్లుప్తంగా ప్రతి ఒక్కరికి ఈ పరిచయ వేదికపై అర్థమవుతుందని ఎలాంటి సమస్యలను ఒకరికొకరు పంచుకోవడం ఎవరికైనా ఆపద కలిగితే మేమంతా ఉన్నాం అనే ఒక సందేశం పంపడమే దీని ఉద్దేశం అని అదే విధంగా మరియు విద్యార్థులకు కావాల్సింది మంచి ప్రేమ ఆప్యాయత అనురాగం ఏ స్థాయిలో ఉన్న మనం కలిసి చదువుకునే రోజుల్లో కలిగిన జ్ఞాపకాలను స్మరించుకోవడం అనేది ఒక గొప్ప విషయం అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మ్యాస్ కంప్యూటర్. ప్రధానమైనవని మెరుగైన విద్య తోటే ఆర్థిక లాభాలు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో ఒకటి అయ్యామని ఆప్యాయత అందరు ఈ వేదికపై పలకరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గురువులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :